*దెనట…” తెలంగాణా* *కొమరయ్య కొండకి అంటూ” విప్లవ నేపథ్యంలో రాసిన పాటలు బాగా ప్రజాదరణ పొందాయి ఆయన రాసిన* *పాటల్లో ఉత్తరాంధ్ర నుడికారం, యాసా, ఊపూ మిళితమై* *వుంటాయి.పాడటంలో* *చిందేయడంలో*
*చేతుల మధ్య గజ్జల్ని* *మోగించడంలో ఆయన పంథా ప్రత్యేకమైనది అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లోఈ పాటను ఇంగ్లిష్లోకి అనువదించి పాడుకున్నా* *రంటే….వంగపండు పాటలకున్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు..!!*
*కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన పాటలు ఊతమయ్యా*
*యి.తన జానపద గేయాల* *ద్వారా ప్రజా చైతన్యం తీసు*
*కొచ్చేందుకు* *ప్రయత్నించాడు.గద్దర్ వంటి వారితో కలిసి* *జననాట్యమండలి కోసం పనిచేశాడు. ఆయన* *సుమారుగా 400 వరకు పాటలు రాశారు. అవి వివిధ భాషల్లోకి కూడా అనువాదం కావడం విశేషం*.
*వంగపండు కేవలం విప్లవ గీతాలను మాత్రమే రాయలేదు.*
*జానపదంలో శృంగారాన్ని* *కూడా ఒలికించాడు*
*ఆవులు తోలుకొని*
*అలుగెల్లి నువ్వొస్థే*
*ఇలగెల్లి నేనొస్తే…*
*మద్దెల కింది చేను*
*ఇద్దరినీ కలిపింది.”!!*
*వంటి పాటలు కూడా వంగపండు కలం నుంచి*
*జాలు వారాయి.*
*రెండు నెలల ముందు తానా అంతర్జాతీయ తెలుగు సాహితీ వేదికలో రెండున్నర గంటల పాటు సోలోగా*
*తన పాటతో మురిపించాడు.వీనుల విందు చేశాడు.*
*మాధురి స్మృతి చెరగనే లేదు.ఆ పాట ఇంకాచెవుల్లో*
*మార్మోగుతునే వుంది.ఇప్పుడేమో. చెప్పాపెట్టకుండా*
*తన పాటల పిలగాడ్ని మనకొదిలేసీ తాను వెళ్ళి*
*పోయాడు.*
*విశాఖపట్నం షిప్ యార్డులో పనిచేస్తూ, పాటలు రాసి పాడుతూ, విప్లవోద్యమానికీ చేదోడయ్యాడు. తర్వాత* *కాలంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జన నాట్యమండలి* *కళాకారుడిగా అనేక విప్లవ, ప్రజా గీతా*
*లు రచించి గానం చేశాడు*
*1974 అక్టోబర్ లో విశాఖలో జరిగిన విరసం సాహిత్య పాఠశాలతో వంగపండు ప్రస్థానం మొదలైంది.అప్పుడే*
*వంగపండనే ఓ కొత్త* *గాయకుడు గొంతెత్తి పాడిన వైనాన్ని జనం కథలు కథలుగా చెప్పుకున్నారు. విరసం విశాఖ ప్రచురణ ఏరువాక, వంగపండు ప్రసాద్ పాటలు పుస్తకం* *వెలువడిసాహితీ లోకంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది*.
*సికాకులం, ఇజీనారం జిల్లాలో ఎం ఎల్ ఎ అనే ఇంగ్లిష్ మాటకు రూపాంతరపదం…అమ్మోలె గానీ “అనేది ఆరోజుల్లో అందరూ చెప్పుకునే వారు. ఆయన పాటల్లోని మాటల్లో ఉత్తరాంధ్ర* *సొగసుఎగిసిపడేది.ఎమర్జన్సీలో ఆయన బహిరంగ పాటకు కొంత విరామం.ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ* *గొంతుపెగిలింది.వంగపండు పాట జనం గుండెల్ని తాకింది*
*1978లో ఆయన రాసిన “భూమి భాగోతం” సృజనలో*
*అచ్చైంది.తర్వాత సృజన ప్రచురణ పుస్తకంగా వచ్చింది. భూమి భాగోతం కొన్ని వేల ప్రదర్శనలు జరిగాయి..* *1990లో విరసం ఇరవైయేళ్ళ మహాసభల సందర్భంగా ఆయన పాటల సంపుటం, ఎంపిక చేసిన పాటల ఆడియో కాసెట్ వచ్చాయి*
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADADEPARTMENTAL TESTS: MAY 2025 SESSION(Notification No.04/2025) APPSC DEPARTMENTAL TESTS: MAY… Read More