IIIT RJUKT 2022 Counselling Dates and Venue for Provisionally selected candidates

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IIIT RJUKT 2022 Counselling Dates and Venue for Provisionally selected candidates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 12 నుంచి 16 వరకు క్యాంపస్‌ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

అక్టోబరు 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లలో; అక్టోబరు 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌లో; అక్టోబరు 15, 16 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.  అక్టోబరు 17 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

ఈ ఏడాది నాలుగు క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం మొత్తం 44,208 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ సెప్టెంబర్ 29న విడుదల చేసింది. ఒక్కో క్యాంపస్‌లో 1030 సీట్ల చొప్పున మొత్తం 4,120 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు.

ఆర్జీయూకేటీ త్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థుల జాబితా క్యాంపస్‌లవారీగా:

 Download call letter for Provisionally selected candidates

error: Content is protected !!