Supply of IFPs and Smart TVs to AP schools covered in Mana Badi Nadu Nedu…
*♦️విలీనాన్ని 0.1% మంది వ్యతిరేకిస్తేనిలిపివేస్తామా?*
*♦️చట్టాలు చేయడానికి ప్రజాభిప్రాయం. తీసుకోం కదా!*
*♦️ఎమ్మెల్యేలే వారి అభిప్రాయం చెబుతారు*.
*♦️మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు*
*🌻ఈనాడు, అమరావతి*: ‘ఇంటి పక్కనే పాఠశాల ఉండాలంటే ఎలా? మన వీధిలోనే బడి ఉంటుందా?’ అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పది ఫలితాల విడుదల అనంతరం బుధవారం పలు అంశా లపై ఆయన మాట్లాడుతూ.. “ప్రైవేటు పాఠశాలల్లో చదివించే తల్లిదండ్రులు పిల్లల్ని రోజూ బడిలో దింపి, తీసుకువస్తున్నారు కదా? అమెరికాలాంటి దేశాల్లో పార శాల ఉండే ప్రాంతంలో ఇళ్ల అద్దెలు, భవనాల ధరలు ఎక్కువగా ఉంటాయి. మంచి పాఠశాలకు అంత డిమాండ్ ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం రావాలి. తరగతుల విలీనం కారణంగా విద్యార్థి కిలోమీ టరు దూరం వెళ్లి, రావడం కష్టమన్నది తల్లిదండ్రులు అభిప్రాయం కావొచ్చు’ అని బొత్స పేర్కొన్నారు. ‘విలీనం మొదట మూడు కిలోమీటర్లు చేయాలనుకున్నా కిలోమీటరుకు తగ్గించాం. ఏదైనా చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకొం కదా! ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రా యమే చెబుతారు. విద్యార్థు లను దృష్టిలో పెట్టుకొని విధాన నిర్ణయాలు తీసుకుం టున్నాయి. తరగతుల విలీ నంలో ఎక్కడైనా సమస్యలు వస్తే పరిశీలిస్తాం. ఏదైనా ప్రయోగాత్మకంగా చేసినప్పుడు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి” అని వెల్లడించారు.
*♦️ప్రవేశాల తర్వాతే తెలుస్తుంది..*
“పాఠశాలల మ్యాపింగ్, విలీనం వల్ల ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు తగ్గిపోయాయని చాలామంది అంటు న్నారు. ప్రవేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15కు పూర్త వుతాయి. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య తెలుస్తుంది. ప్రదేశాలు తగ్గాయా? పెరిగాయా? అన్నది ప్రశ్న కాదు. ప్రభుత్వ బడులను మెరుగుపరిస్తే విద్యార్థులు వారంత టవారే వస్తారు. ప్రభుత్వ బడుల్లో చదవాలనే తపన, ప్రేరణ కల్పించాలి. నిర్బందంగా ప్రైవేటు బడులు మూసి, ప్రభుత్వ పాఠశాలలు తీసుకురావాలన్నది మా అభిమతం కాదు. విద్యార్థి తనకు నచ్చినచోట చదువు కునే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పరిస్థితులు కల్పించాలి. కొవిడ్ సమయంలో ఏడు లక్షలమంది విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎంతమంది ప్రవేశాలు పొందారో మొత్తం వివరాలు ఇస్లాం. దీంతోపాటు మా విశ్లేషణ ఇస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకు తగ్గారు? ఎందుకు పెరి గారనే విశ్లేషణ ఇస్తాం” అని తెలిపారు.
*♦️ఉద్యోగులు అమలు చేయాలి.*
“ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే హక్కు ఉద్యోగులకు లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉద్యోగులు సహకరించాలి. దాన్ని అమలు చేయడం వారి విధి. ఉద్యోగపరంగా వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడగొచ్చు, తరగతుల విలీనంపై విద్యార్థుల తల్లిదం డ్రుల నుంచి ఎక్కడా వ్యతిరేకత లేదు. ఎక్కడైనా 0. 1 శాతంమంది వ్యతిరేకిస్తే 99.99 శాతం మంది అంగీ కరిస్తున్నదానిని కాదంటామా? ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఉద్యోగులు సమర్ధించకపోయినా పర్వా లేదు గానీ, సహకరించాలి. ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతోనూ సమావేశం నిర్వహించాను. హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117 పైన కొన్ని సవరణలు చేశాం. ఎమ్మెల్సీలు బస్సు యాత్ర అని తిరుగుతు న్నారు. ప్రభుత్వ విధానాన్ని కాదంటే ఎలా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలు, జీవన ప్రమాణాలు, ఆర్ధిక పరిస్థితులను మెరుగుపర్చడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి” అని వెల్లడించారు.
Public Services-Human Resources-Transfers and Postings of Employees-Guidelines G.O.M.S.No.90 dated 12-09-2024 Public Services-Human Resources-Transfers and Postings… Read More
APPSC GROUP-I MAINS POSTPONED: ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADANOTIFICATION.NO.12/2023, DATED: 08/12/2023 FOR GROUP-I SERVICESWEB… Read More