AP ICET 2022 COUNSELING SCHEDULE RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
AP ICET 2022 COUNSELING SCHEDULE RELEASED 

AP ICET 2022 COUNSELING:ఆంధ్రప్రదేశ్‌లో ఎంసీఏ, ఎంబీఏ కోర్సు్లో ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఐసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూలును అక్టోబరు 7న అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను వెబ్‌‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 9 నుంచి 22 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.

AP ICET 2022 COUNSELING SCHEDULE RELEASED


✦ అక్టోబరు 9 నుంచి 12 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 

✦ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అక్టోబరు 10 నుంచి 14 మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

✦ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థులు అక్టోబరు 14 నుంచి 16 వరకు వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.

✦అభ్యర్థులు అక్టోబరు 17న వెబ్ ఆప్షన్లలో ఏమైనా మార్పులు ఉంటే సరిచేసుకోవచ్చు.

✦ అక్టోబరు 19న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

✦ సీట్లు పొందినవారు అక్టోబరు 20 నుంచి 22 మధ్య సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

అక్టోబరు 9 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్
అక్టోబరు 10 నుంచి 14 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్
అక్టోబరు 14 నుంచి 16 వరకు వెబ్‌ఆప్షన్లు
అక్టోబరు 17 వెబ్ఆప్షన్ల మార్పు
అక్టోబరు 19 సీట్ల కేటాయింపు
అక్టోబరు 20 నుంచి 22 వరకు కాలేజీలో రిపోర్టింగ్


AP ICET 2022 కౌన్సెలింగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

✦ AP ICET కౌన్సెలింగ్ వెబ్‌సైట్, https://icet-sche.aptonline.in/ వెళ్లాలి.

✦ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.

✦ రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి లాగిన్ కావాలి.

✦ అవసరమైన వివరాలను నింపాలి.

✦ బుక్ స్లాట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఎంచుకోవాలి.

✦ ఎంపిక నమోదు కోసం లాగిన్ చేయాలి.

✦ సేవ్ చేసిన ఎంపిక ప్రక్రియను ప్రింట్ తీసుకుని.. లాగ్ అవుట్ చేయండి.

కౌన్సెలింగ్ వెబ్‌సైట్: CLICK HERE


ఏపీలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఐసెట్‌(AP ICET)-2022 ఫలితాలను ఆగస్టు 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డులను కూడా ఏపీ ఉన్నత విద్యా మండలి అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 87.83 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ ఐసెట్-2022 పరీక్షకు మొత్తం 42,496 మంది హాజరుకాగా 37,326 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో అత్యధికంగా బాలురు 87.98 శాతం పాస్‌ అయ్యారు. ఇక అమ్మాయిలు విషయానికొస్తే 87.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 


JOIN OUR TELEGRAM GROUP-CLICK HERE

 

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!