APPSC GROUP-IV RECRUITMENT 2022 APPLY ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

 

APPSC GROUP-IV RECRUITMENT 2022 APPLY ONLINE

ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అక్టోబరు 18 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


పోస్టుల వివరాలు..


ఖాళీల సంఖ్య: 06


1) జూనియర్ అసిస్టెంట్: 01

విభాగం: ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 


2) జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 01

విభాగం: ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. 


3) టైపిస్ట్: 01

విభాగం: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  


4) టైపిస్ట్: 01 

విభాగం: సెరీకల్చర్ సర్వీస్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  


5) స్టెనో/టైపిస్ట్: 01

విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  


6) జూనియర్ స్టెనోగ్రాఫర్: 01

విభాగం: లేబర్ డిపార్ట్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. టైప్ రైటింగ్ తెలిసి ఉండాలి. టైపింగ్‌లో ప్రభుత్వ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.  




వయోపరిమితి:
 
01.07.2022 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
రాతపరీక్ష విధానం:
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1: 150 మార్కులు, పేపర్-2: 350 మార్కులు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించిన అంశాల నుంచి 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్క తప్పు సమాధానానికి 1/3 వంతు మేర కోత విధిస్తారు. 
పరీక్షలో అర్హత మార్కులు: జనరల్, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీలకు 35 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. 
జీతం: నెలకు రూ.25,220 – రూ.80,910.


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.09.2022.

ఫీజు చెల్లించడానికి చివరితేది: 18.10.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.11.2022.

Notification

Online Application

Website 

error: Content is protected !!