BOTSA SIR:MEETING ON TEACHERS APPS ISSUE
యాప్ వివాదం.. ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి బొత్స చర్చలు విఫలం
➪ అమరావతి:
᯾ ముఖ ఆధారిత హాజరు యాప్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
᯾ గత 3 రోజులుగా యాప్ డౌన్లోడ్లు వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు | వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.
᯾ విద్యాశాఖ కమిషనర్ వద్ద చర్చలు విఫలమవటంతో ఉపాధ్యాయ సంఘాలను మంత్రి చర్చలకు ఆహ్వానించారు.
᯾ ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ… సొంత ఫోన్లలో ముఖ ఆధారిత హాజరు యాప్ను ఒప్పుకునేది లేదని స్పష్టం | చేశారు.
᯾ తమ స్మార్ట్ ఫోన్లలో యాప్లోడౌన్లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారం బయటకు లీక్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
᯾ పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
᯾ పాఠశాలలో ప్రత్యేక పరికరంతో మౌఖిక హాజరుకు అంగీకరిస్తామని ఉపాధ్యా యులు స్పష్టం చేశారు.
᯾ ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.
᯾ ఉపాధ్యాయుల డిమాండ్లపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ముఖ ఆధారిత యాప్పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు.
᯾ మంచి లక్ష్యానికి ఉపాధ్యా యులు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు.
᯾ ఇప్పటికే లక్షమంది ఉపాధ్యా యులు యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.
᯾ మిగతా 50శాతం మంది త్వరలోనే రిజిస్టర్ చేసుకుంటారని వెల్లడించారు.
᯾ 15 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించి యాప్ అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు.
᯾ హాజరు, అలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు.
᯾ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
᯾ సెల్ఫోన్లు ఉద్యోగులవా? ప్రభుత్వం ఇస్తుందా? అనేది ఆయా శాఖల నిర్ణయమన్న మంత్రి బొత్స .. మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావొచ్చన్నారు.