IIIT ADMISSIONS 2022: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ఆగస్టులో నోటిఫికేషన్

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*📚✍️ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు ఆగస్టులో నోటిఫికేషన్✍️📚*
*♦️ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి*
*🌻వేంపల్లె, న్యూస్ టుడే:* రాష్ట్రంలోని ఇడుపుల పాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఆగ స్టులో నోటిఫికేషన్ వెలువరిస్తామని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీని శుక్రవారం ఆయన సందర్శించి సమ స్యలపై చర్చించారు. ఆర్జీయూకేటీకి న్యాక్ గుర్తింపు నకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆర్జీ యూకేటీకి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామానికి నోటిఫికేషన్ ఇవ్వగా 30 దరఖాస్తులొచ్చాయని, సెప్టెంబరులోగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో 660 రెగ్యులర్ అధ్యాపకులు, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒప్పంద అధ్యాపకులు, పొరుగు సేవల సిబ్బంది జీతాల పెంపు విషయమై కమిటీని నియమించామని, ఆగస్టు 4న సమావేశమై సాధ్యాసాధ్యాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తుందని చెప్పారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!